అక్షరశక్తి, హైదరాబాద్ : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రార్థించారు. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.