అక్షరశక్తి, హన్మకొండ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి వారి స్వగ్రామం వంగపహాడ్ గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా జీవితంలో నాయకుల పుట్టిన రోజు నలుగురికి ఉపయోగపడాలన్న సదుద్దేశ్యంతో భాగంగా కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని వ్యవసాయ క్షేత్రాల్లో నాట్లు వేస్తున్న తల్లులకు వాన కాగితాలు అందించారు. అలాగే, గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా వరంగల్ – హైదారాబాద్ హైవే పై గల చిరు వ్యాపారులకు, చేపల వ్యాపారులు ముదిరాజ్ లకు వర్షాల నుండి రక్షణగా గొడుగులు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రవి నాయక్, చింతం శ్రీనివాస్, పాలమాకుల కొమురన్న, జెట్టి రాజేందర్, దేవయ్య, పిన్నింటి విజయ్, భాస్కర్, వెంకటేష్, రఘుపతి రెడ్డి, రంగా రెడ్డి, రాజేష్, తోట శ్రీధర్, సతీష్, ధనుంజయ్, వెంకటేష్, హరీష్, రజినీ కాంత్ లు తదితరులు పాల్గొన్నారు.