అక్షరశక్తి, పర్వతగిరి : హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ వద్ద డీఎస్ఎస్ భవన్లో శనివారం రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్ ప్రీతం, తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, షెడ్యూల్ తెగల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్లను తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, మాజీ జెడ్పిటిసి బానోత్ సింగ్ లాల్ నాయక్, తెలంగాణ సంఘం రాష్ట్ర నాయకులు బూడిద రామ్మూర్తి, నిడిగొండ రామచంద్రు, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.