Thursday, September 19, 2024

హనుమకొండ మెడికవర్ హాస్పిటల్‌లో ఠాగూర్ సీన్ రిపీట్

Must Read

డెడ్ బాడీకి ట్రీట్‌మెంట్ చేశారంటూ ఆరోపణలు

అక్షరశక్తి, పర్వతగిరి: హనుమకొండ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న సుశీల (72) బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో మెడికవర్‌లో చేరిది. అయితే హాస్ప‌ట‌ల్ సిబ్బంది ఆపరేషన్‌కు ముందే రూ. 2 లక్షల 10వేలు వసూలు చేసి ఒకేసారి రెండు సర్జరీలు చేశారని ఆమె బంధువులు తెలిపారు. వారం రోజులుగా సుశీలకు బ్లడ్ ఎక్కించి, డయాలసిస్ చేసి.. ఈసీజీ అంటూ హడావుడి చేసి.. చివరికి చనిపోయిందని చెబుతున్నారని వెల్లడించారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే సుశీల చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన మనిషికే ట్రీట్ మెంట్ చేశారని వాపోతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఆందోళనకు దిగారు. విష‌యం తెలుసుకున్న‌ పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిస్థితిని అదుపు చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img