అక్షరశక్తి, వరంగల్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్ ఘన నివాళులర్పించారు.
అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా కాకతీయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్, జిల్లా కలెక్టర్ గోపి తదితరులు హాజరయ్యారు.
ఈసందర్భంగా బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వరంగల్ కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆవిష్కరించారు.
ఎంపీ పసునూరి దయాకర్, కార్పొరేటర్లు ఓని స్వర్ణలత భాస్కర్, బాలిన సురేశ్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.