Saturday, July 27, 2024

ఓరుగ‌ల్లులో కొన‌సాగుతున్న మంత్రి హ‌రీశ్‌రావు ప‌ర్య‌ట‌న

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. ఉద‌యం ఆయ‌న‌ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారికి ద‌ర్శించుకున్నారు. అనంత‌రం వరంగల్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హెల్త్ సిటీ పనులను ప‌రిశీలించారు. ఏడాది సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నిత్యం పర్యవేక్షిస్తూ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంత‌రం మ‌హ‌బూబాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీప్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్, నరేందర్ తదితులున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img