Saturday, July 27, 2024

పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలని అలా చేశా..

Must Read
  • నిందితుడి స‌మాధానంతో అవాక్కైన పోలీసులు
  • ఫేక్ ఫోన్ కాల్ ఆకతాయి అరెస్ట్

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : రైలులో బాంబు ఉందన్న ఫోన్ కాల్‌తో పోలీసుల‌ను ఉరుకులు, ప‌రుగులు పెట్టించిన ఆకతాయిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఫేక్ కాల్ చేసింది హైద‌రాబాద్ గండిమైసమ్మ బహదూర్ పల్లికి చెందిన తొర్రి కార్తిక్ గా గుర్తించారు. కార్తిక్ ను ఉద‌యం అదుపులోకి తీసుకొని విచారించ‌గా అత‌డు ఇచ్చిన స‌మాధానంతో పోలీసుల‌కు దిమ్మ‌తిరిగింది. ఎందుకిలా చేశావని ప్రశ్నించగా.. పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలనే ఉద్దేశంతో రైలులో బాంబు ఉంద‌ని ఫేక్ కాల్ చేశానని నిందితుడు చెప్పడంతో ఆ సమాధానం విని అవాక్కయ్యారు.

విశాఖ నుంచి వచ్చే రైలులో బాంబు ఉందని బుధవారం ఫోన్ కాల్ రావడంతో కొన్ని గంటలపాటు అందరూ నానా హైరానా పెట్టారు. ఫేక్ కాల్ అని తెలిసిన తర్వాత పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ ఫోన్ కాల్ చేసిందెవరో తెలుసుకునేందుకు లోకల్ పోలీసులు, రైల్వే పోలీసులు ఉమ్మడిగా వేట ప్రారంభించారు. టెక్నాలజీ సాయంతో కాల్ చేసిన నిందితుడి ఆచూకీ కనిపెట్టి ఆకతాయిని పట్టుకున్నారు. ఎందుకు ఇలాంటి ఫేక్ కాల్ చేశావని ప్రశ్నించగా.. తన కాల్ కు పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దామని అలా చేశానని చెప్పాడు. నిందితుడ్ని అరెస్టు చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img