ప్రాణహిత పుష్కరాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జ్యోతి దంపతులు త్రివేణి సంగమంలో పుష్కరస్నానం ఆచరించారు. గురువారం ఉదయం వీఐపీ పుష్కరఘాట్ కు చేరుకొని చీర, సారె, పసుపు, కుంకుమ, పూలు, గాజులు గంగమ్మ తల్లికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి కాళేశ్వర క్షేత్రానికి చేరుకోగా ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకుల సమక్షంలో ముక్తీశ్వరుడికి, శుభనంద అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఎస్పీ బోనాల కిషన్, తదితరులు పాల్గొన్నారు.