Saturday, September 7, 2024

గురుకుల విద్యార్థినుల ఆచూకీ లభ్యం..

Must Read

అక్షరశక్తి హన్మకొండ క్రైమ్, వర్ధన్నపేట: ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు గంటల సమయంలోనే మిస్సింగ్ కేసును ఛేదించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థినులు, 9వ తరగతి చెందిన మరో బాలిక మంగళవారం ఉదయం కనిపించలేదు. వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన హాస్టల్ వద్దకు చేరుకున్నారు. బంధువులు,స్నేహితుల వద్ద వాకబు చేయగా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు వార్డెన్ స్వరూప ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు. మరికాసేపట్లో వివరాలు వెల్లడించనున్నట్లు తెలిసింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img