- బీఆర్ఎస్లో చేరిన 15వ డివిజన్ అధ్యక్షుడు ఎలగొండ ప్రవీణ్
- మరో 200 మందికిపైగా యువకులు, మహిళలు కూడా..
- కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
-
అక్షరశక్తి, పరకాల: పరకాలలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ 15వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలగొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని గొర్రెకుంట, పోతరాజు పల్లె గ్రామానికి చెందిన 200 మందికిపైగా యువకులు, మహిళలు బీఆర్ఎస్లో చేరారు.
పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి సమక్షంలో పరకాలలోని పార్టీ కార్యాలయంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్రెడ్డి పద్దతి నచ్చక, డివిజన్ పరిధిలోని అభివృద్ధి, కేసీఆర్ సంక్షేమ పథకాల అమలు విధానానికి ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. భారీ చేరికలతో పరకాలలో కాంగ్రెస్ పార్టీ డబ్బా కాళీ కాబోతున్నదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలులేరని అన్నారు.
పార్టీలో చేరిన వారు ఎకుల రాజు (కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ), జన్ను లెనిన్ (యూత్ అధ్యక్షుడు), ఇంద మనోజ్ ( 15వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సోసిల్ మీడియా), సిలువేరు వసంత్, సౌరం ప్రభాకర్, ల్యాదేళ్ల ఇమ్మనిమేల్, కేదాసి ప్రభుదాస్, ల్యాదేళ్ల ప్రభాకర్, ఇంద వినయ్, సుమన్, కొట్టే మరియతో 200 మందికి పైగా ఉన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Must Read