అక్షరశక్తి, వరంగల్ : పంజాబ్లోని అమృతసర్ పట్టణంలో ఆగస్టు 7వ తేదీన “అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభ” నిర్వహిస్తున్నామని, ఈ మహాసభకు వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి బీసీ విద్యార్థులు, బీసీ యువత పెద్ద ఎత్తులో తరలి వచ్చి ఈ సభను విజవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరేగంటి నాగరాజు గౌడ్ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే బీసీ కుల గణన చేపట్టి బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం పోరాడుతోందని అన్నారు. ఈ మహత్తర పోరాటానికి బిసి కులాలు రాజకీయ చైతన్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్టు 7వ తేదీన “అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభ” నిర్వహిస్తున్నామని తెలిపారు. బీసీ ఉద్యమాన్ని దేశమంతా విస్తరిద్దాం.. ఢిల్లీ కోట మీద బీసీ జెండా ఎగురవేద్దాం.. అని పిలుపునిచ్చారు.