హసన్పర్తి సీఐ సురేష్, ఎస్ఐ దేవేందర్
అక్షరశక్తి, హసన్ పర్తి : హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని ముచ్చర్ల గ్రామంలో సీఐ సురేష్, ఎస్సై దేవేందర్, సిబ్బంది పర్యటించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువులు, కాలువల వద్ద జాగ్రత్తలు వహించాలని, విద్యుత్ కనెక్షన్ల దగ్గర, విద్యుత్ వాడే విషయంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. మట్టి గోడలు, పురాతన ఇండ్లలో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.