అక్షరశక్తి, పరకాల : హైదరాబాద్లో మున్నూరుకాపు సంఘం తెలంగాణ, మున్నూరుకాపు యువత రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో హనుమకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తి గ్రామానికి చెందిన కేలిక పవన్ను మున్నూరుకాపు సంఘం రాష్ట్ర మీడియా వైస్ ఇన్చార్జిగా నియమిస్తూ రాష్ట్ర కమిటీ న్యాయపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… తన నియామకానికి సహకరించిన బండి సంజీవ్ పటేల్, చింతపండు మహేందర్ పటేల్తోపాటు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మున్నూరు కాపుల ఐక్యత కోసం, ఆశయాల కోసం కృషి చేస్తాననని అన్నారు.