కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హన్మకొండ జిల్లా పర్యటన షురూ అయింది. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేంద్ర అవార్డు అందుకున్న రేగొండ పీహెచ్సీని సందర్శించారు. వైద్యులతో మాట్లాడి.. సేవలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నేరుగా రామన్నగూడలోని పాండవులగుట్ట సందర్శించారు.
ఈక్రమంలోనే సోమవారం రాత్రి హన్మకొండకు చేరుకున్న కిషన్రెడ్డి మంగళవారం ఉదయం చారిత్రక భద్రకాళి ఆలయాన్ని సందర్శించారు. కిషన్రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేశారు. కాగా హన్మకొండకు వచ్చిన కిషన్రెడ్డికి స్థానిక బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.