- భర్త గొంతు కోసిన భార్య
- పెళ్లైన నెలరోజులకే దారుణం
- దామెర మండలంలో ఘటన
అక్షరశక్తి, దామెర : హన్మకొండ జిల్లాలోని దామెర మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని పసరగొండ గ్రామంలో భార్య తన భర్త గొంతును కోసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి మామిడి శెట్టి రాజు అర్చనకు వివాహమై నేటికి సరిగ్గా నెల రోజులు అవుతోంది. రాజు మల్కపేటలోని ఓ క్రషర్ లో సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు.సోమవారం ఉదయం రాజు ఇంట్లో పడుకొని ఉండగా అర్చన బ్లేడ్ తో దాడి చేసింది. దీంతో రాజు మెడకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పెళ్లి అయి నెల రోజులకే భర్తపై హత్యకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది.
Must Read