అక్షరశక్తి, వరంగల్: 4వ బెటాలియన్ మామునూరు క్యాంపులో స్వాతంత్య్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 4వ బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్ రెడ్డి, బెటాలియన్ ఉన్నతాధికారులు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోనే జగ్జీవన్రామ్ మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన మార్గం నేటి తరానికి అనుసరణీయమని కొనియాడారు. ఊపిరి ఆగే వరకూ బడుగు వర్గాల కోసమే జీవితాన్ని ధార పోశారని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు డి.నరేందర్ రెడ్డి, బి. వేణుగోపాల్ రెడ్డి, ఆర్ఐలు చంద్రన్న, కిరణ్ కుమార్, ఏవీఎన్ రెడ్డి, దయ శీల, వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, ఆర్ఎస్ఐ అనిల్, బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.