Monday, September 16, 2024

భారత అంధుల క్రికెట్ జట్టు క్రీడాకారులను అభినందించెన సీఎం రేవంత్ రెడ్డి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్ప బలం మనలో ఉండటం ప్రధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి న్యూయార్క్‌ నగరంలో భారత అంధుల క్రికెట్ జట్టు క్రీడాకారులను కలుసుకున్నారు. వారిని కలుసుకున్న సందర్భం తనకు లభించిన ఒక అమూల్యమైన అవకాశంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. వారితో ఆప్యాయంగా కొద్దిసేపు ముచ్చటించారు. జీవితంలో ఎలాంటి సవాళ్లయినా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని వారి నుంచి నేర్చుకోగలమన్నారు. వారిలోని స్పూర్తిని అభినందిస్తూ వారికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img