Monday, September 16, 2024

మద్యం సేవించి వాహనాలు నడ‌పొద్దు –  ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారయణ

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడ‌పొద్దని, కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాల‌ని వరంగల్‌ ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారయణ సూచించారు. వ‌రంగ‌ల్‌ ట్రైసిటి పరిధిలో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ తనిఖీలో ట్రాఫిక్‌, లా అండ్‌ అర్డర్‌ పోలీసులకు పట్టుబడిన వాహనదారులకు వరంగల్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ట్రాఫిక్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌లో కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్‌ ఎసిపి ముఖ్య అతిథిగా హాజ‌రై వాహనదారులు, వారితో వచ్చిన వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల కాలంలో మద్యం సేవించి రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో అధికంగా నిరుపేద కుటుంబాలకు చెందిన వారు వున్నార‌ని, వీరి మరణంతో ఈ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. ఈ సంవత్సరంలో ట్రై సిటి పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులకు సంబంధించి మొత్తం 5410 కేసులు నమోదు కావడంతో పాటు 60 మంది వాహనదారులకు ఒకటి లేదా రెండు రోజుల పాటు జైలు శిక్షలు విధించడం జరిగిందని అలాగే మరో 5095 మంది వాహనదారులు జరిమానాలు చెల్లించారని ట్రాఫిక్‌ తెలియజేసారు. ఈ కార్యక్రమములో ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇంచార్జ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఐ బుచ్చిరెడ్డి ఇతర ట్రాఫిక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img