అక్షరశక్తి, హైదరాబాద్ : మే8 మదర్స్ డే సందర్భంగా బస్సుల్లో ప్రయాణించే తల్లులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ అందిస్తోంది. మాతృ దినోత్సవం సందర్భంగా ఐదేళ్లలోపు పిల్లలతో బస్సుల్లో ప్రయాణించే తల్లులకు ఏసీ సేవలతో సహా అన్ని బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ ఆఫర్ను మే 8 ఆదివారం మాత్రమే ఉంటుందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వైస్ చైర్మన్ ఎండీ వీసీ. సజ్జనార్ ఈ సందర్భంగా తల్లులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనల్ని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన మహిళలందరికీ ప్రేమ, గౌరవాన్ని అందించడానికి మదర్స్ డే గొప్ప సమయం అన్నారు. ఇది అమ్మకు ఆర్టీసీ ఇచ్చే చిరుకానుక అని తెలిపారు.