Monday, September 16, 2024

ఎంఈఓ ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా

Must Read

అక్షరశక్తి, పరకాల: ఎంఈఓ ఆఫీస్ ముందు ప‌ర‌కాల ఎస్ఎఫ్ఐ క‌మిటి ఆధ్వర్యంలో ధ‌ర్నా చేసిన నాయ‌కులు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్, పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మాట్లాడుతూ.. పరకాల పట్టణంలో స్థానిక ఎంఈఓ 4 మండలాలకు ఇన్చార్జి ఉండడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. ఏ మండలానికి వెళ్లిన ఎంఈఓ ఆఫీసులో ఆయ‌న ద‌ర్శం మాత్రం క‌ల‌గ‌ట్లేదుఅని.దీని వ‌ల్ల విద్యార్ధులకు అనేక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ ఎంఈఓలను నియమించాలన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రకి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యారంగ సమస్యలు ప్ర‌భుత్వం పరిష్కరించలేక పోతుంద‌ని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని అన్నిరు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి సాయి తేజ, భరత్, మహేష్, సాయి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img