అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలోని పండరీ పూర్కు చెందిన సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తెలంగాణ కేడర్కు చెందిన ఆయన మొదట భద్రాచలం ఏఎస్పీగా పని చేశారు. నాలుగేళ్లుగా ములుగు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. జయశంకర్ – భూపాలపల్లి జిల్లాకు దాదాపు రెండేళ్లు ఇంచార్జీ ఎస్పీగా కొనసాగారు. అనంతరం టీఎస్ఆర్టీసీలో విజిలెన్స్ జాయింట్ డైరెక్టర్ గా తొమ్మిది నెలల కాలం పాటు విధులు నిర్వహించారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించారు….