కేటీఆర్ బహిరంగ సభకు మందు అపశృతి
అక్షరశక్తి, హన్మకొండ : రాష్ట్ర ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటనలో అపశృతి దొర్లింది. మహానగర పాలక సంస్థ, ఇతర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు రూ. 184.53 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కాసేపట్లో కుడా గ్రౌండ్లో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకాన్నున్నారు. ఈ సభ కోసం టీఆర్ఎస్ నాయకులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో కార్యకర్తల కోసం వేసిన టెంట్లు చిన్న గాలిదుమారానికే మొత్తం కూలిపోయాయి. దీంతో గులాబీ నేతలు హైరానా పడుతున్నారు. సభా సమయంలో కూలిపోతే పరిస్థితి ఏంటని నిర్వాహకులపై మండిపడ్డారు. దీంతో సభా ప్రాంగణాన్ని పునరుద్ధరించే పనిలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి.