Saturday, July 27, 2024

కేయు స్కాలర్స్ హాస్టల్ కు తాళాలు..

Must Read

అక్షరశక్తి, హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థుల హాస్టల్ కు అధికారులు తాళాలు వేశారు.గత కొద్దిరోజులుగా యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో అధికారులు యూనివర్సిటీ స్కాలర్స్ పై కక్ష సాధిపు చర్యలకు దిగారు.ఈ క్రమంలో విద్యార్థులు యూనివర్సిటీ వీసీ ని కలిసేందుకు వెళ్లగా అక్కడ అందుబాటులో లేకపోవడంతో రిజిస్ట్రార్ ను కలిసి తాళాలు తీయాలని కోరారు.కొత్తగా అడ్మిషన్లు పొందిన వారికి కార్డు ఇవ్వకుండా పాత విద్యార్థులకు మెస్ కార్డులు రెన్యూవల్ ఇవ్వకుండా మానసికంగా వేదిస్తున్నారని రిజిస్ట్రార్ ను కలిసిన విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.కరోనా కారణంగా తమ పరిశోధన ఆలస్యం అయ్యిందని విన్నవించుకున్నా వీసీ రిజిస్ట్రార్ లు పట్టించుకోవడం లేదని స్కాలర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img