అక్షరశక్తి, హన్మకొండ : హన్మకొండ కుమార్పల్లిలోని న్యూలయోల హైస్కూల్లో కొమురంభీం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల కరెస్పాండంట్ తాడిశెట్టి క్రాంతికుమార్ కొమురంభీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. జల్, జంగల్, జమీన్ నినాదంతో పోరాటం చేసిన యోధుడు అని కొనియాడారు. పిల్లలకి కొమురంభీం జీవిత చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో బుచ్చిమల్లు, నాగలక్ష్మి, సమీనా, సౌజన్య, మాధవి, ప్రసన్న, జ్యోతి, వాజిద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.