Saturday, July 27, 2024

పోలీసుల ఆత్మీయ సమ్మేళనం

Must Read

అక్షరశక్తి, మడికొండ: కాజీపేట ఏసీపీ కార్యాలయం పరిధిలోని పోలీస్ స్టేషన్లో సిఐలు, ఎస్సైలు, కానిస్టేబుల్ లతో ఆదివారం మడికొండలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు‌. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ జోన్ డిసిపి ఎంఏ బారీ హాజరయ్యారు. కాజీపేట ఏసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డిసిపి ఎంఏ బారీ మాట్లాడుతూ ఎలక్షన్లు సమీపిస్తున్నాయని, పోలీసులు అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అనంతరం కాజీపేట ఏసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. స్నేహపూరిత వాతావరణంలో పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన సిఐలు ఎస్సైలు కానిస్టేబుల్ నుంచి కూడా అభిప్రాయాలు సూచనలు సలహాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనగామ ఫాదర్, ఇన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, లోడి స్వచ్చంద సంస్థ నుంచి హెల్మెట్లు పంపిణీ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img