Sunday, September 8, 2024

సీపీ రంగ‌నాథ్ జోష్‌.. గ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నంలో స్టెప్పులేసిన పోలీస్ క‌మిష‌న‌ర్‌

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: విధి నిర్వ‌హ‌ణ‌లో నిత్యం బిజీగా ఉండే వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ బుధ‌వారం ఉత్సాహంగా స్టెప్పులేశారు. గణేష్ నిమజ్జ‌నం పురస్కరించుకొని తన క్యాంప్ కార్యాలయంలో పోలీసుల‌తో క‌లిసి స‌ర‌దాగా డాన్స్ చేశారు. నవరాత్రులు పూజ‌లందుకొని నిమజ్జ‌నానికి తన ఇంటి నుండి గణేష్ ప్రతిమను శోభయాత్రగా తరలిస్తున్న వేళ సీపీ రంగనాథ్ క్యాంప్ కార్యాలయ సిబ్బందితో కలిసి హుషారుగా స్టెప్పేలేశారు. మ‌రోప‌క్క గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప‌రిధిలో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా బందోబ‌స్తు ఏర్పాటుచేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img