టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో ఘనంగా గణేశ్ నిమజ్జనం
హన్మకొండలోని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ బ్రాంచ్ కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉ త్సవాలు కన్నులపండువగా ముగిశాయి. సెప్టెంబర్18 నుండి ప్రారంభమై 9 రోజులపాటు అంగరంగ వై భవంగా నవరాత్రులు గణపతికి విశేష పూజలు నిర్వహించారు. సెప్టెంబర్ 27 త్రయోదశి బుధవారం వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. చివరి రోజున లంబోధరుని మహా ప్రాసాదం లడ్డు వేలం నిర్వహించగా మంచాల శ్రవణ్ కుమార్ కు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ బ్రాంచ్ అ సిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఏజెన్సీ వేముల వినోద్ కుమార్ మాట్లాడుతూ… పురాణాల ప్రకారం హిందువుల తొలి పండుగ వినాయక చవితి రోజున ఎలాంటి కార్యక్రమం ప్రారంభించినా జయప్రదం అవుతుందన్నారు. అగ్రపూజ అందుకునే గణనాథుడు విఘ్నాలను తొలగిస్తాడన్నారు. ఫైనాన్షియల్ అడ్వైజర్ మిత్రులు, బిజినెస్ అడ్వైజర్స్, సీనియర్ డిస్ట్రిబ్యూటర్ల సహకారంతో బ్రాంచ్ను అగ్రగామిగా నిలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్ శ్రీరామోజు మధుసూదన్, సీనియర్ మేనేజర్ కొయ్యడ లక్ష్మణ్, మేనేజర్లు గంధమల్ల ప్రవీణ్ కుమార్, గుం డేటి అనిల్ కుమార్, డోలి రాజ్ కుమార్, పెంచాల అశోక్, క్యాషియర్ స్వప్న, సినియర్ డిస్ట్రిబ్యూటర్స్ నాండ్రే అమర్ నాథ్, తిరునహరి శోభారాణి, ఏండ్రాల సాంబశివరావు, కె కళ్యాణి, అల్లుట్ల రజిత, రాజేందర్ రక్తాని, కందకట్ల రాజు, పానుగంటి మురళి, రాయరోజు స్వప్న, సోల స్వప్న, నల్ల గోపి, బరుపటి సంపత్ కు మార్, మంచాల శ్రవణ్, విట్ఠల్ బాబు తదితరులు పాల్గొన్నారు.