ముల్కనూర్ ఎస్సై సాయిబాబు
అక్షరశక్తి, భీమదేవరపల్లి: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ప్రజలంతా భక్తిశ్రద్ధలతో నిమజ్జనోత్సవాన్ని నిర్వహించుకోవాలని ముల్కనూర్ ఎస్సై సాయిబాబు తెలియజేసారు. నిమజ్జనంలో డీజే సౌండ్ సిస్టం నిషేధించామని, ఎవరైనా వినియోగించినట్లయితే వారిపై కేసు నమోదు చేసి డీజే సౌండ్ సి స్టం సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తామని ఆయన హెచ్చరించారు. అదే విధంగా డీజే సౌండ్ సిస్టం వాడినా, మద్యం సేవించి ఉత్సవాల్లో పాల్గొన్నా, మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించినా వారిపై చట్టపరమైన చ ర్యలు తీసుకుంటామన్నారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే
డయల్ 100, లేదా లోకల్ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం అందజేయాలని ఆయన కోరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తిశ్రద్ధలతో ప్రశాంతంమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని ముల్కనూర్ ఎస్సై సాయిబాబా విజ్ఞప్తి చేశారు.
Must Read