Sunday, September 8, 2024

మేయ‌ర్ గుండు సుధారాణికి బ‌ల్దియా షాక్‌..

Must Read
  • నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఫ్లెక్సీల ఏర్పాటు
  • రూ. 2 లక్షల జరిమానా విధించిన అధికారులు
    అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మేయ‌ర్ గుండు సుధారాణికి బ‌ల్దియా అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌గ‌రంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకుగాను రూ. 2 లక్షల జరిమానా విధించారు.
  • రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఉద‌యం వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు.

  • ఈసంద‌ర్భంగా న‌గ‌రంలో టీఆర్ఎస్ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లుకుతూ పెద్దఎత్తున న‌గ‌రంలో ఫ్లెక్సీలు, స్వాగ‌త తోర‌ణాలు ఏర్పాటు చేశారు. న‌గ‌రం మొత్తాన్ని గులాబీమ‌యంగా మార్చివేశారు. ఈక్ర‌మంలోనే నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలపై బ‌ల్దియా అధికారులు కొర‌డా ఝ‌లిపించారు. మేయర్ సుధారాణికి రూ. 2 లక్షలు, కేశవరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50 వేల జరిమానా విధించారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img