Saturday, July 27, 2024

18న రామ‌ప్ప‌లో శిల్పం, వర్ణం, కృష్ణం ..

Must Read
  • హాజ‌రుకానున్న సంగీత దర్శకుడు తమన్,
    ప్రముఖ డ్రమ్స్ వాయిద్యకారుడు శివమణి
  • పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
    అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఏప్రిల్ 18న‌ ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా పాలంపేటలో గ‌ల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – పర్యాటక, ఆర్కియాలజీ శాఖల సహకారంతో ములుగు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శిల్పం, వర్ణం, కృష్ణం సెల్ బరేటింగ్ ది హెరిటేజ్ రామప్ప పేరుతో మెగా వేడుకలను నిర్వ‌హించ‌నున్నారు. ఈమేర‌కు శ‌నివారం రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం పురస్కరించుకొని రామప్ప దేవాలయంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్, ప్రముఖ డ్రమ్స్ వాయిద్యకారుడు శివమణి, సింగర్ కార్తీక్, ప్లూటిస్ట్ నవీన్‌తో పాటు 300 మంది కళాకారులతో వేడుకలను ఘనంగా నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రాష్ట్ర హెరిటేజ్ తెలంగాణ అధికారులు నారాయణ, రాములు నాయక్, నాగరాజు, ములుగు జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి రమాదేవి, చారిత్రక పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి, వివిధ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు వాసవి గ్రూప్ రింకి, క్యూసిటీ మాలతి, రజత్, గ్రూప్ రాహుల్ కానుగంటి, గురు ప్రొడ‌క్ష‌న్ రవి దులిపాల్ల తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img