అక్షరశక్తి, హన్మకొండ : హన్మకొండలోని రాంనగర్లో శనివారం నవతరంగాలు ఛానెల్ ఘనంగా ప్రారంభమైంది. బండి మొగిలి, బానోత్ విజయ్ కుమార్ సారధ్యంలోని నవతరంగాలు ఛానెల్ విజయవంతంగా నడవాలని డిపిఆర్వో భానుప్రసాద్ ఆకాంక్షించారు. ఊహాజనిత వార్తలకు అవకాశం ఇవ్వకుండా, వాస్తవిక వార్తలనే ప్రసారం చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ మీడియా రంగంలోకి కొత్తగా ప్రవేశిస్తున్న నవతరంగాలు ఛానెల్ ప్రజల సమస్యలను ప్రసారం చేయాలని సూచించారు.
ఈ ప్రారంభోత్సవంలో సీనియర్ పాత్రికేయులు కంభాలపల్లి కృష్ణ మాట్లాడుతూ బండి మొగిలి ఆశయాలకు అనుగుణంగా నవతరంగాలు ఛానెల్ రూపొందింది అని అభినందించారు. ఈ కార్యక్రమంలో విసికె రాష్ట్ర అధ్యక్షులు డా.జిలుకర శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ సదయ్య, మాజీ అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి, జాయింట్ సెక్రటరీ వలిశెట్టి సుధాకర్, పాత్రికేయులు శివ, జడ్పీ సూపరింటెండెంటు నాగేశ్వరరావు, పోతుల కృష్ణమూర్తి, దరావత్ అశోక్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.