Sunday, September 8, 2024

ముగిసిన కేబినెట్ భేటీ..

Must Read

తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం మంత్రివ‌ర్గ సమావేశం ప్రారంభమైన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశంలో పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను మరోసారి నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా పలు పనులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. చెన్నూరు ఎత్తిపోతల పథకానికి మంత్రి మండలి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.


రూ.1658కోట్లతో చెన్నూరు ఎత్తిపోతలు ..
రూ.1658కోట్లతో చెన్నూరు ఎత్తిపోతలు నిర్మించాలని మంత్రి మండ‌లి నిర్ణయించింది. ఈ ఎత్తిపోతల పథకంతో ఐదు మండలాల్లోని 103 గ్రామాలకు తాగు, సాగునీరు అందనున్నది. చెన్నూరు ఎత్తిపోతలకు పది టీఎంసీల కాళేశ్వరం జలాలను వినియోగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇదిలా ఉండగా.. మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్‌ విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేబినెట్‌ నిర్ణయాలను ఆయ‌న స్వ‌యంగా వెల్ల‌డించ‌నున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img