Saturday, July 27, 2024

కేజీఎఫ్ -2కు కేసీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్‌

Must Read

టికెట్ రేట్లు పెంచుకునేందుకు స‌ర్కార్ అనుమ‌తి

పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ -2 పై తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేజీఎఫ్ -2 టికెట్ రేట్లు పెంచుకునేందుకు స‌ర్కార్ అనుమ‌తి ఇచ్చింది. ఈనెల 14వ తేదీ నుంచి నాలుగు రోజుల‌పాటు ధ‌ర‌లు పెంచుకునేందుకు అవ‌కాశం ఇచ్చింది. మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్లు , ఐమాక్స్‌, సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో ఒక్కో టికెట్ మీద రూ. 50, ఏసీ థియేట‌ర్ల‌లో ఒక్కో టికెట్ మీద రూ. 30 పెంచుకునేందుకు ప‌ర్మీష‌న్ ఇచ్చింది. నాన్ ఏసీ థియేట‌ర్ల‌లో ఎలాంటి మార్పులేదు. అంతేగాక 4 రోజుల‌పాటు 5 షోలు వేసుకునేలా వెసులుబాటు క‌ల్పించింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ కనీవినీ ఎరగని బిజనెస్

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ 2 మూవీ పాన్ ఇండియా మూవీగా ఈనెల 14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్ప‌టికే కేజీఎఫ్ టీం ప్రమోషన్లలో బిజీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా టీం పర్యటించి, పలు నగరాల్లో ప్రెస్ మీట్‌లు నిర్వహించింది. ప్రశాంత్ నిల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి న‌టించింది. కేజీఎఫ్ బ్లాక్ బ్లాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో దానికి సీక్వెల్‌గా వ‌స్తున్న కేజీఎఫ్ -2 పై ప్రేక్ష‌కుల్లో, ఇండ‌స్ట్రీలో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కేజీఎఫ్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కనీవినీ ఎరగని బిజనెస్ చేసిన‌ట్లు స‌మాచారం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img