కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ 2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేజీఎఫ్కు సీక్వెల్గా తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ ఏప్రిల్14 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా విడుదలైన ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలుకొట్టిన బాహుబలి 2ని కూడా ఈ సినిమా క్రాస్ చేస్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. అంతలా ఈ సినిమాకు క్రేజ్ అండ్ బుకింగ్స్ జరుగుతున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. కేజీఎఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించడంలో మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటారో మనం ఊహించుకోవచ్చు. ఇంత పెద్ద భారీ ప్రాజెక్టుకు స్టార్ ఎడిటర్ పనిచేసి ఉంటాడని అంతా అనుకుంటున్నారేమో. కానీ అలాంటిదేమి లేదు. ఈ సినిమాకు ఎడిటర్గా పనిచేసింది కేవలం 19 ఏళ్ల కుర్రాడు. అవును.. మీరు చదివింది నిజమే. ఉజ్వల్ కుల్కర్ణి అనే ఈ కుర్రాడు గతంలో షార్ట్ ఫిలింస్, ఫ్యాన్ ఎడిట్స్ వంటివి చేస్తూ ఉండేవాడు.
అయితే కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్కి అతను చేసిన కొన్ని ఫ్యాన్ ఎడిట్స్ ప్రశాంత్ నీల్కు బాగా నచ్చాయి. దీంతో కేజీఎఫ్ ఛాప్టర్-2కి ఎడిటింగ్ బాధ్యతలను అప్పగించాడు. అందుకు తగ్గట్లే ఉజ్వల్ కూడా హాలీవుడ్ రేంజ్లో తన పనితనాన్ని చూపించాడు. సినిమా సక్సెస్లో ఉజ్వల్ పాత్ర చాలా కీలకంగా మారింది. ఇంత తక్కువ వయస్సులోనే పాన్ ఇండియా సినిమాకు ఎడిటర్గా పనిచేయడం నిజంగా ఉజ్వల్కు పెద్ద అఛీవ్ మెంట్ అని అంటున్నారు సినీ పండితులు.