Saturday, July 27, 2024

28 ఏళ్ల తర్వాత సొంతూరుకు యోగి..

Must Read

త‌ల్లి నుంచి ఆశీర్వాదం పొంది భావోద్వేగానికి గురైన యూపీ సీఎం

ఢిల్లీకి రాజైనా త‌ల్లికి కొడుకే.. పుట్టిన ఊరిని, క‌న్న త‌ల్లిని మ‌రిచిపోవ‌డం ఎవ‌రికీ అంత సులువుకాదు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కు అలాంటి ప‌రిస్థితే ఎదురైంది. తన వ్యక్తిగత అంశాలకు అంత‌గా ప్రాధాన్యం ఇవ్వని యోగీ.. సుమారు 28 ఏళ్ల తర్వాత సొంతూర్లో అడుగుపెట్టారు. అంతేకాదు తల్లి నుంచి ఆశీర్వాదం పొంది భావోద్వేగానికి లోనయ్యారు. యోగి ఆదిత్యానాథ్‌ సొంతూరు ఉత్తరాఖండ్‌లోని పౌరీ. సుమారు 28 ఏళ్ల తర్వాత ఆయన సొంత ఊరిలో అడుగుపెట్టారు. అంతేకాదు యూపీకి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తన తల్లిని కలవడం ఇదే తొలిసారి కూడా. అందుకే ఆమె ఆశీర్వాదం తీసుకుని ఆప్యాయంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయనే ట్విటర్‌లో షేర్‌ చేశారు.

బుధవారం యోగి మేనల్లుడి పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమం ఉంది. అందుకోసమే ఆయన సొంతూరికి వెళ్లారు. సీఎంగా ఒక అధికారిక కార్యక్రమం బదులు.. సొంత పని మీద వెళ్లడం ఆయనకు ఇదే తొలిసారి కావడం విశేషం. కరోనా టైంలో ఏప్రిల్‌ 2020లో హరిద్వార్‌లో ఆయన తండ్రి చనిపోగా.. అంత్యక్రియలకు ఆయన హాజరు కాలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తగా.. కరోనా టైంలో 23 కోట్ల మందికి తండ్రిగా బాధ్యతలు తనపై ఉన్నాయని, అలాంటిది తానే కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే ఎలా అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అంతకు ముందు పౌరీ జిల్లా కేంద్రంలోని మహాయోగి గురు గోరఖ్‌నాథ్‌ ప్రభుత్వ కళాశాలలో తన ఆధ్యాత్మిక గురువైన మహంత్‌ అవైద్యనాథ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారాయన.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img