Saturday, July 27, 2024

రాహుల్‌గాంధీ ఓయూ ప‌ర్య‌ట‌న‌పై కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌

Must Read

హైకోర్టులో హౌజ్‌ మోషన్‌ పిటిషన్ దాఖ‌లుచేసిన కాంగ్రెస పార్టీ

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ విద్యార్థి సంఘాలు, పార్టీ నేతల పోటాపోటీ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. మరోసారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ రాహుల్ పర్యటన అనుమతి వ్యవహారంపై మరో పిటిషన్‌ వేసింది. రాహుల్‌ ఓయూ పర్యటనపై మరోసారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హౌజ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఓయూ వీసీ, హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ పిటిషన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం.. మే 7వ తేదీన ఓయూలో పర్యటించి.. విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఆంక్షల నేపథ్యంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ అందుకు అనుమతి నిరాకరించారు. ఈ విషయమై ఇదివరకే తెలంగాణ కాంగ్రెస్‌.. హైకోర్టును ఆశ్రయించగా, నిర్ణయం వీసీదేనని హైకోర్టు సైతం పేర్కొంది. అయితే .. రాహుల్ ఓయూ ప‌ర్య‌ట‌న‌పై దాఖ‌లైన పిటిష‌న్‌పై న్యాయ‌స్థానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img