అక్షరశక్తి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని సంకల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై చర్చించనున్నారు. అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర...
అక్షరశక్తి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈడీ, ఐటీ సోదాలు.. టీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న డ్రామాలన్నారు. ఎఫ్ఆర్వో అధికారి హత్యకి సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. బీసీ...
ఢిల్లీ : ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు బుధవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో పదిశాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు...
2020లోనే పోలీసులకు శ్రద్ధ ఫిర్యాదు
ఢిల్లీ : శ్రద్ధా మర్డర్ కేసులో కీలక విషయం వెలుగుచూసింది. అఫ్తాబ్ తనను చంపి ముక్కలుముక్కలుగా నరికిపారేస్తాడంటూ.. 2020 నవంబర్ 23న శ్రద్ధ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తనను తీవ్రంగా కొడుతున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. శ్రద్ధ ఆనాడు ఫిర్యాదు చేసినా పోలీసులు...
కర్ణాటక : అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో చీలిక వస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ శివకుమార్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చీలిక లేదని, అందరం ఒక్కటిగానే ఉన్నామని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన మీడియాతో...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వంట పని కోసం వచ్చి చోరీకి పాల్పడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దొంగను సీసీఎస్, హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడి నుండి పోలీసులు రెండు లక్షల యాభైవేల రూపాయల విలువైన ద్విచక్ర వాహనం, ఒక ల్యాప్ టాప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్...
అక్షరశక్తి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి నివాసం, కాలేజీలు, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు మంత్రి మల్లారెడ్డి సెల్ఫోన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన నివాసం పక్క క్వార్టర్స్లో జూట్ బ్యాగ్లో సిబ్బంది దాచి పెట్టిన సెల్ఫోన్ను కనిపెట్టారు. అలాగే, మంత్రి సమీప బంధువు ఇంట్లో అధికారులు నగదును సీజ్ చేశారు. త్రిశూల్...
అక్షరశక్తి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో పార్టీ మారబోతున్నట్టు జరగుతున్న ప్రచారాన్ని నిజంచేస్తూ నేడు పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. బాధగానే కాంగ్రెస్తో బంధం తెంచుకుంటున్నానన్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర...
ఆర్మీలో 16ఏళ్లపాటు విధులు
2019లో ఏకశిల డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు
మూడేళ్లుగా ఉచితంగా శిక్షణ
20మంది గ్రామీణప్రాంత అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు ఉచితంగా ఈవెంట్స్ శిక్షణ
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : నీకు కుదిరినప్పుడు కాదు.. ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తే దానిని సాయం అంటారు. ఇప్పుడు ఏకశిల...
పశ్చిమబెంగాల్: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎంసీకి చెందిన సుమారు 30మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని, ఇంకా ఎక్కువ కాలం టీఎంసీ ప్రభుత్వం ఉండదని వారికి తెలుసునని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.