అక్షరశక్తి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో పార్టీ మారబోతున్నట్టు జరగుతున్న ప్రచారాన్ని నిజంచేస్తూ నేడు పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. బాధగానే కాంగ్రెస్తో బంధం తెంచుకుంటున్నానన్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. పార్టీ ముఖ్య నాయకురాలు సోనియా గాంధీకి కూడా లేఖ రాశానని మర్రి శశిధర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. పార్టీలో పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందన్నారు. ప్రజల కోసం పని చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. కాంగ్రెస్కు చేతి గుర్తు సూచించిన వారిలో తన కూడా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. నేటి నుంచి కాంగ్రెస్ హోంగార్డుగా ఉండటం లేదని మర్రి శశిధర్రెడ్డి వెల్లడించారు.