అక్షరశక్తి, హన్మకొండ క్రైం: కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ కేటగిరీ -2 అడ్మిషన్లలో వీసీ అవకతవకలకు పాల్పడ్డారని ఆందోళన చేపట్టి అరెస్టై 14 రోజుల పాటు రిమాండ్ కు వెళ్లిన ఇద్దరు కేయూ విద్యార్థి నేతలకు హన్మకొండ మూడవ మునిసిపల్ మెజిస్ట్రేట్ బుధవారం బెయిలు మంజూరు చేసింది. ఈ ఘటనలో 8 మందికి వారం కిందట బెయిల్ మంజూరు చేయగా, మిగిలిన ఇద్దరినీ 14 రోజులపాటు రిమాండ్ కు పంపిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఇవాళ గట్టు ప్రశాంత్, అంబాల కిరణ్కు బెయిల్ మంజూరైంది.
Must Read