అక్షరశక్తి, ములుగు : సీఆర్పీఎఫ్ ఎస్సై ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడులో గురువారం చోటు చేసుకుంది. వాజేడు పోలీస్ స్టేషన్ క్యాంప్ లోని సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ‘C’ కంపెనీకి చెందిన సీఆర్పీఎఫ్ ఎస్సై జెడ్ ఎల్ ఠాక్రే (56) కొద్దిసేపటి క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన స్వస్థలం మహారాష్ట్ర 1986 బ్యాచ్కి చెందిన ఠాక్రే వ్యక్తిగత కారణాల వలన క్యాంప్ లోని తన రూమ్ లో ఫ్యాన్ కి ఉరివేసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై కేసు నమోదు చేసి, వారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరు నాగారం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.