అక్షరశక్తి, నెక్కొండ : వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్లో ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో శుక్రవారం ఉదయం పొగతో కూడిన మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు స్టేషన్లోనే రైలును ఆపేశారు. పొగలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే.. సాంకేతిక లోపంతోనే ఈ ఘటన చోటుచేసుకన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి అంతా అదుపులోకి వచ్చిన తర్వాత యథావిధిగా రైలు అక్కడి నుంచి బయలుదేరింది. పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైలు నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు. అధికారులు అప్రమత్తం కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.