- అక్షర శక్తి, హైదరాబాద్: గోదావరి ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. బుధవారం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బిబి నగర్ వద్ద పట్టాలు తప్పింది. అయితే ట్రైన్ డ్రైవర్, గార్డ్ సమన్వయంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. S1 బోగి నుంచి S5 బోగీల వరకు పట్టాలు తప్పయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
Must Read