అక్షరశక్తి, జగిత్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి విలేజ్ కి చెందిన రాజ్ కుమార్ అనే బాలుడి తల్లి కొండగట్టుకు వెల్లే దారిలో రోడ్డు పక్కన షెడ్డు వేసుకుని అంజన్న భక్తులకు కొబ్బరి కాయలు, పూజ సామగ్రి అమ్ముతూ జీవిస్తుంది. ప్రతి రోజూ తన తల్లి 20 కిలోలకు పైగా బరువు ఉన్న సామగ్రిని ఇంటి నుంచి షెడ్డు వరకు భుజంపై మోసుకెళ్లి అమ్మేది. తల్లి భాదను చూసిన రాజ్ కుమార్ స్మార్ట్ గా ఆలోచించాడు. పాత పెప్సీ ట్రేకు మూడు చక్రాలు బిగించి చిన్న తోపుడు బండి తయారు చేశాడు. తాడుతో కట్టి ప్రతి రోజు తల్లికి సామగ్రి అందిస్తున్నాడు. ఆ బాలుడి చిన్న ఐడియా తల్లికి బరువులు మోసే భాద తప్పించింది.