Saturday, July 27, 2024

ఎమ్మెల్యేపై ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : వికారాబాద్ జిల్లా తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బూతులు తిట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన విపక్ష పార్టీల నేతలు ఎమ్మెల్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పందించారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పోలీసులంటే నాకు గౌరవం ఉంది. నన్ను వేదికపై ఇబ్బంది పెట్టినందుకు రూరల్ సీఐని ఎందుకు ఇలా జరిగింది అని అడిగాను. రూరల్ సీఐ, టౌన్ సీఐతో నేను ఫోన్‌లో మాట్లాడాను. నేను సీఐని ఒక్క మాట కూడా అనలేదు. ఆ ఆడియో రికార్డు కూడా నాది కాదు. ఏకంగా దూషించానని వార్తలు వేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ నేనేం వెనక్కి తగ్గను, తాండూరు ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తాండూరు ప్రజలు రౌడీలు కాదు.. దేవుళ్లు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డే ఇదంతా చేయించాడని తెలుస్తోంది. నేను మనస్తాపం చెందానని ఎమ్మెల్యే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నిన్న వేదికపై నన్ను అవమానించారు. రౌడీలను తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంట ఎప్పుడూ ఇద్దరు రౌడీలు ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాండూరులో భయంకరంగా ఇసుక దందా నడుస్తోంది. ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నారని తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img