Saturday, July 27, 2024

మానుకోట బీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం

Must Read
  • వ‌రుస‌గా పార్టీని వీడుతున్న కీల‌క నేత‌లు
  • కారు పార్టీకి బీఆర్ఎస్ యువ‌నేత బోయిన‌ప‌ల్లి స‌తీష్‌రావు గుడ్‌బై
  • పార్టీ అభ్య‌ర్థి ముర‌ళీనాయ‌క్ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిక‌
    అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాద్ : మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంక‌ర్‌నాయ‌క్‌కు వ‌రుస‌గా షాక్‌లు తగులుతున్నాయి. ఇంత‌కాలం బీఆర్ఎస్‌లో కీల‌కంగా ప‌నిచేసిన నాయ‌కులు ఒక్క‌రొక్క‌రుగా పార్టీ వీడుతున్నారు. ముఖ్యంగా గూడూరు మండ‌లంలో గులాబీ పార్టీలో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న‌టికి మొన్న గూడూరు మండ‌లానికి చెందిన బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, పీఏసీఎస్ చైర్మ‌న్ చ‌ల్ల లింగారెడ్డితోపాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. తాజాగా గూడూరు మండ‌లం కొల్లాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ‌నేత బోయిన‌ప‌ల్లి స‌తీష్‌రావు ఆధ్వ‌ర్యంలో ప‌లువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈసంద‌ర్భంగా మానుకోట‌లోని పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో డీసీసీ అధ్య‌క్షుడు భ‌ర‌త్‌చంద‌ర్‌రెడ్డి, రాష్ట్ర నాయ‌కులు వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, మానుకోట నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి ముర‌ళీనాయ‌క్ స‌తీష్‌రావుకు కండువాక‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసంద‌ర్భంగా స‌తీష్‌రావు మాట్లాడుతూ.. మ‌హ‌బూబాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థి ముర‌ళీనాయ‌క్ గెలుపు కోసం త‌న వంతు కృషి చేస్తాన‌ని అన్నారు. మానుకోట గ‌డ్డ‌పై కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img