– తెలంగాణ- మహారాష్ట్ర మధ్య వాహనాల రాకపోకలు బంద్
అక్షరశక్తి: భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల పరిధిలోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీకి సంబంధించిన రెండు పిల్లర్లు కుంగిపోయాయి. 19, 20వ నెంబర్ల పిల్లర్లు బ్యారేజి కుంగిపోవడంతో మహారాష్ట్ర- తెలంగాణ మధ్య రాకపోకలను అధికారులు తాత్కలికంగా నిలిపివేశారు. బ్యారేజీ కుంగిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.