అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాద్ జిల్లా పరిధిలో పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఆరుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎస్సై నరేష్ సిరోల్ నుండి జిల్లా హెడ్ క్వార్టర్స్కు, ఎస్సై రమాదేవి బయ్యారం నుండి సీరోల్కు, ఎస్సై ఉపేందర్ గంగారం పీఎస్ నుండి బయ్యారంకు, ఎస్సై దిలీప్ గూడూరు పీఎస్ నుండి గంగారంకు, ఎస్సై గోపి మహబూబాబాద్ టౌన్ నుండి కురవికి, ఎస్సై రామ్ కురవి నుండి హెడ్ క్వార్టర్ కు బదిలీ అయ్యారు.