అక్షరశక్తి, మడికొండ: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వివాహిత ఈరబోయిన అనిత తన కూతురిని చంపి తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.