అక్షరశక్తి, హన్మకొండ : ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా విజయం సాధించిన డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్ నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయ పండితుల సమక్షంలో ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో విష్ణువర్ధన్ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ మాట్లాడుతూ… అందరి సహకారంతో జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ రీజినల్ మేనేజర్ సిరిపురం తిరుపతి రెడ్డి, ఆంధ్రప్రభ ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో ఇంచార్జ్ తుమ్మల కృష్ణారెడ్డి, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బోళ్ల అమర్, ఇతర కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రభ యాజమాన్యం, జర్నలిస్టు నాయకులు, జర్నలిస్టులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు విష్ణువర్ధన్ కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.