అక్షరశక్తి, హన్మకొండ క్రైం : విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై వరంగల్ సీపీ ఏవీరంగనాథ్ కొరఢా ఝళిపిస్తున్నారు. తాజాగా, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హత్య కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, పోలీస్ అధికారిగా చేయాల్సిన విధులు చేయకుండా, గతంలో నమోదైన కేసుల్లో దర్యాప్తు విధుల్లో ఆలసత్వంతో వ్యవహారించినందుకు బచ్చన్నపేట ఎస్ ఐ నవీన్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసారు.